సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గాంధీలకు రుణపడి ఉంటాం

నమస్తే శేరిలింగంపల్లి: పేదల పక్షపాతి, పేదలకు దైవం, మనసున్న నేత సీఎం కేసీఆర్ అని ముఖ్యమంత్రి తమ జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు డబుల్ బెడ్ పొందిన లబ్ధిదారులు. వారికి డబుల్ ఇండ్లు వచ్చేలా కృషి చేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చందానగర్ డివిజన్ పరిధిలోని పి ఏ నగర్ కి లబ్దిదారు లీల మొదటి విడత డ్రా లో డబుల్ బెడ్ రూమ్ పొందారు.

ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్ గాంధీ ఆమెను శాలువాతో సత్కరించి, అభినందించారు. పేదవారు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతో ఇళ్ళు కట్టించి ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, ప్రసాద్, జనార్దన్, బాబు మోహన్ మల్లేష్, శ్రావణి రెడ్డి, నవాజ్, కుమార్ కార్యకర్తలు, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here