కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి పర్యటన

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని సాయిజ్యోతి నగర్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయిజ్యోతి నగర్ కాలనీ వాసులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం వల్ల కాలనీలో పర్యటించి సమస్యలను పరిశీలించామన్నారు. సాయిజ్యోతి నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, మంటినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పెండింగ్ లో ఉన్న పనులను సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాధవరం గోపాల్ రావు, ప్రతాప్ రెడ్డి , యాసిన్ హైమధ్, రజాక్, వెంకట్, సాజాధ్, అషం, రాజు, యూసఫ్, దర్మెందర్, చౌదరి, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here