కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇద్దాం : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీ, కాజాగుడా పలు కాలనీలలో మాజీ కార్పొరేటర్ సాయి బాబా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.

చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు.

పార్టీ కరపత్రాలు అందజేస్తూ..

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here