ఉచిత వైద్య శిబిరానికి స్పందన

  • త్రిశూల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం, ఉచిత కంటి పరీక్షలు
  • క్యాంపును ప్రారంభించిన రవి కుమార్, యాదవ్, రాజేశ్వరరావు

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఉచిత రక్తదానం, కంటి పరీక్షల శిబిరాన్ని ముఖ్య అతిథులుగా మారబోయి రవికుమార్ యాదవ్, వడ్డేపల్లి రాజేశ్వరరావు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న వారమవుతామని, మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేయాలని సూచించారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన త్రిశూల్ ఫౌండేషన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్ రావు, నర్సింగ్ యాదవ్, నరేందర్ రెడ్డి , నరసింహ చారి, నర్సింగ్ రావు, కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

త్రిశూల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రవి కుమార్, యాదవ్, రాజేశ్వరరావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here