వృత్తి విద్యా కళాశాలలకు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి

  • టెక్ఫ అధ్యక్షుడు ప్రొ. పి వై రమేష్ డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి: వృత్తి విద్యా కళాశాలలకు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వృత్తి విద్య కళాశాలల అధ్యాపకుల సంఘం టెక్ఫా అధ్యక్షులు ప్రొ. పి వై రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుండి వృత్తి విద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి ఇంతవరకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాక యాజమాన్యాలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ విషయంలో మానవత్వ దృక్పథంతో జోక్యం చేసుకొని సమస్యను పరిషరించాలని కోరారు. గత మూడు నెలల నుంచి అధ్యాపకులకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్న వారి పరిస్తితి అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించి త్వరితగతిన గత సెప్టెంబర్ నుంచి ఏడు నెలలు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here