అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్, మసీద్ బండ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి మసీదు బండ కాలనీవాసులు, కార్యకర్తలతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను మనమందరం కలిసి కొనసాగిద్దామని, భారత దేశంలో డాక్టరేట్ సాధించిన మొదటి వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. తాగునీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. నియోజవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ పెద్ద విగ్రహాన్ని రాబోయే రోజుల్లో ఆవిష్కరిద్దామన్నారు. బిజెపి ఎప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బలరాజ్, ప్రేమ్, రాము, సుదర్శన్, రమేష్, గోపి యాదవ్, గోపాల కృష్ణ, అరుణ్ యాదవ్ ,మహిళా నాయకులు పద్మ, అరుణ,పార్వతి, నాగులు, రాజు, నవీన్ రెడ్డి, నరసింహ, అనిల్, శ్రీకాంత్, మహేష్, రామ్ రెడ్డి, మహేష్ రాజ్, పరమేష్ నాయక్, కరణ్, రాకేష్, మసీద్ బండ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
మసీదు బండ కాలనీవాసులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రవికుమార్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here