అంబేద్కర్ కు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, చందానగర్ అంబేద్కర్ విగ్రహం, ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్ నందు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ ఆశయసాధనకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, గంగల గణేష్ యాదవ్, బ్రమయ్య యాదవ్, మాల మహానాడు జాతీయ నాయకులు చెన్నయ్య, జైపాల్, సుబ్రహ్మణ్యం, వార్డ్ సభ్యులు రామచందర్, తైలి కృష్ణ, స్వామి, కృష్ణ నాయక్, నర్సింగ్ నాయక్, బస్తి అధ్యక్షులు మహీందర్, బాలరాజు యాదవ్, కృష్ణ ముదిరాజ్, లింగబాబు, రాజు, నారాయణ నాయక్, లక్ష్మీ నారాయణ, కేశవ్, యాదగిరి, హఫీజ్ పెట్ డివిజన్ ఎస్.సి సెల్ అధ్యక్షుడు కంది ఙ్ఞానేశ్వర్, చిన్న, ప్రవీణ్, రాఘవేందర్, అశోక్, సీతారాం పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here