ప్రతి బస్తీ, కాలనీ అభివృద్ధే ధ్యేయం : కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ. 80 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న అంతర్గత రోడ్ల పనులను జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారి డిప్యూటీ ఇంజనీర్ రమేష్, స్థానిక నాయకులు కలిసి పర్యవేక్షించారు. అనంతరం స్థానిక నాయకులు, ప్రజలతో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ సిద్దిఖ్ నగర్ బస్తీ లో పాదయాత్ర చేశారు. స్థానికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలు విని సంబంధిత అధికారులకు ఆ సమస్యలను తక్షణ పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తు అభివృద్ధి పనులను చేయిస్తున్నామన్నారు. డీఈ రమేష్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు నందు, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవరాజు, బుడుగు తిరుపతి రెడ్డి, సాగర్ చౌదరి, ఉప్పులూరి ఆనంద్, ఫాజిల్, బల్లు, కుమార్, విజయ్ కుమార్, సదర్ సాయి కుమార్, లక్ష్మి బాయి, సదర్ రాము, విజయ్, కైలా రాజేందర్ రెడ్డి, సోను పాల్గొన్నారు.

సిద్దిఖ్ నగర్ లో పాదయాత్ర చేసి పనులు పరిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here