అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ మున్సిపల్ కార్యాలయం, వేమన వికర్ సేక్షేన్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాలతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

వేమన వికర్ సెక్షన్ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అట్ట అడుగు వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, మాజి కౌన్సిలర్ రవిందర్, ఓ.వెంకటేష్, పుల్లిపాటి నాగరాజు, యుసుప్, రాజశేఖర్ రెడ్డి, నరేందర్ భల్లా పాల్గొన్నారు.

చండానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here