దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ కు మనవడు కార్తిక్ గౌడ్ ప్రత్యేక సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: నందిగామలోని రూ 5 కోట్ల విలువైన అర ఎకర భూమిని దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్, గౌడ్ హాస్టల్ ఉపాధ్యక్షుడు గౌడ హాస్టల్ నూతన నిర్మాణం కోసం విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ఇందుకు శుక్రవారం శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం తరఫున దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ ని ఘనంగా సన్మానించారు.

శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం తరఫున దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ కి సన్మానం

హాస్టల్ కు సంబంధించిన వార్త 22 న్యూస్ పేపర్లలో రావడం ఒక అచీవ్ మెంట్ గా భావించి బిఆర్ఎస్ చందానగర్ డివిజన్ యువజన అధ్యక్షుడు, ఆయన మనువడు దొంతి కార్తీక్ గౌడ్ అన్ని పేపర్లను జత చేసి ఒక ఫోటో ఫ్రేం చేయించి చందానగర్ జవహర్ కాలనీలో నివాసం ఉంటున్న తన తాతను స్థానిక గౌడ బృందంతో కలిసి ఆ మెమెంటోను అందజేశారు. ఈ వార్త అన్ని పేపర్లలో రావడానికి కృషిచేసిన పుట్ట వినయ్ కుమార్ కు మన స్పూర్తిగా దొంతి కార్తీక్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరేని యాదగిరి గౌడ్, కరుణాకర్ గౌడ్, వెంకటపతి గౌడ్, వీరేషం గౌడ్, తాళ్ళ ఆనంద్ గౌడ్, దొంతి దీపక్ గౌడ్, దొంతి చైతన్య గౌడ్, ఆర్. నరేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, శ్రీపాల్ గౌడ్లు పాల్గొన్నారు.

అన్ని వార్త పత్రికల క్లిప్పింగ్ లను సేకరించి ఫ్రేం గా చేసి దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్ కి అందిస్తున్న తన మనవడు కార్తీక్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here