అంగన్ వాడి కేంద్రంలో డిజిటల్ లెర్నింగ్

  • ప్రారంభించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురానగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో ఎంపవరింగ్ యంగ్ మైండ్స్ ఎన్జీవో సహకారంతో డిజిటల్ లెర్నింగ్ ను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా, ఐసిడిఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ లక్ష్మీబాయితో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ ఎంపవరింగ్ యంగ్ మైండ్స్ ఎన్జీవో సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, ఇలాంటి కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయి బాబా, ఐసిడిఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, గచ్చిబౌలి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, అంగన్ వాడి టీచర్ శ్రీ లతా, సీనియర్ నాయకులు శేకర్, ప్రభాకర్, వరలక్ష్మి, అరుణ్ గౌడ్, రవి, మధుర నగర్ కాలనీ వాసులు, స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎంపవరింగ్ యంగ్ మైండ్స్ ఎన్జీవో సహకారంతో డిజిటల్ లెర్నింగ్ ను ప్రారంభించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here