ఆర్ వి పంచజన్యలో ఆరెకపూడి గాంధీ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ  ఆర్ వీ పంచజన్య అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి సందర్శించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ సతీమణి శ్యామల దేవి, రాగం సుజాత యాదవ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్ , మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చింత కింది రవీందర్ గౌడ్ , కొండల్ రెడ్డి , కృష్ణ యాదవ్, పొడుగు రాంబాబు, రమేష్, వేణు, భాస్కర్, మహేష్, రాజు, భాస్కర్, శ్రీకళ, సౌజన్య, అనిత కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ వి పంచజన్యలో గణేశుని పూజలో పాల్గొన్న‌ ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here