తుల్జాపూర్ తుల్జా భవాని మాతను దర్శించుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: మహారాష్ట్ర తుల్జాపూర్ తుల్జాభవాని అమ్మవారిని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి ఆలయ కమిటీ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శ్రీరాములు, ములగిరి శ్రీనివాస్, నర్సింగ్ నాయక్, శివ సింగ్, దేవేందర్ రెడ్డి, ప్రకాష్, మన్నే రమేష్, శ్రీహరి, రంజిత్ సింగ్, రవి సింగ్, సురేష్ సింగ్, కిషోర్ సింగ్, జస్పల్ సింగ్, రామ్ సింగ్, జగదీష్ సింగ్, దత్త రాథోడ్, దినేష్ అగర్వాల్, విశాల్ సింగ్, శ్యామ్లాల్ సింగ్, రాజేష్ జాదవ్, పవన్ సింగ్, సమందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

తుల్జాపూర్ తుల్జాభవాని మాతను దర్శించుకున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here