శిల్పా ఎంక్లేవ్ లక్ష్మీ గణపతి దేవాలయంలో వైభవంగా శివ కళ్యాణం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం సోమవారం కొనసాగింది. ప్ర‌ధానార్చ‌కులు ప‌వ‌న‌కుమార శ‌ర్మ‌, ముర‌ళీధ‌ర శ‌ర్మ బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్థానిక భక్తులు వీరభద్రరావు హరిణి అదేవిధంగా వంశీధర్ రెడ్డి శివలీల దంపతులచే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. దీంతో ఆలయ పరిసరాలు శివ నామస్మరణతో మారుమోగాయి.

శివ కళ్యాణం జరిపిస్తున్న పురోహితులు

మూడవరోజు దీపోత్సవంలో ఆల‌య వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ యూవీ ర‌మ‌ణ‌మూర్తి, క‌మిటి స‌భ్యులు చంద్ర‌శేఖ‌ర్‌, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, సుధాకర్, విద్యాసాగర్ ఇతర సభ్యులు, శిల్పాఎన్‌క్లేవ్ కాల‌నీ సంక్షేమ సంఘం స‌భ్యులు, కాల‌నీ వాసులు, ఆల‌య సేవాద‌ళం స‌భ్యులు, ప‌రిసర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ఉత్సాహంగా ప‌దివేల‌ దీపాలు వెలిగించారు. దీప కాంతులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది.

ఉత్సాహంగా దీపాలు వెలిగిస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here