భక్తులతో కిక్కిరిసిన వేంకటేశ్వరాలయం – మొదటి కార్తీక సోమవారం శివలింగానికి అభిషేకాలు

నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర ఆలయ సముదాయంలో కార్తీక మాసోత్సవాలు‌ భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయం ఆవరణలోని శివలింగానికి ఉదయం నుంచి ప్రత్యేకమైన ‌జలాభిషేకాలు, పంచాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులు శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేయించడంతో పాటు నాగుల చవితి ని పురస్కరించుకు‌ని పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి, సేవా సమితి సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

పంచామృత అభిషేకంలో శివలింగం
శివయ్యను దర్శించుకుంటున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here