ప్రతి పేదింటికి‌ కేసీఆర్ సంక్షేమ ఫలం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా మంజూరైన నలుగురి లబ్ధిదారులకు రూ. 4.4 లక్షల చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో పేదవారు సగర్వంగా ఆడపడుచుల వివాహాలు జరిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు తో పాటు మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, టీఆర్ఎస్నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, పాండు గౌడ్, అనిల్ కావూరి, చంద్రమోహన్ సాగర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here