వేడుకగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

నమస్తే శేరిలింగంపల్లి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చందానగర్ శ్రీ శారదా పీఠపాలీత వెంకటేశ్వర దేవాలయ సముదాయంలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. 12వ తేదీన వేదం మంత్రోచ్ఛరణల నడుమ సంకల్పము, విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం నిర్వహించారు. శుక్రవారం ఉదయం 9:00 దీక్షాధారణ, సర్వదేవతా ప్రార్థన, అకల్మష హోమంతో మొదలై సాయంత్రం 5:00 గంటలకు మృత్స్య గ్రహణం( పుట్టమన్ను తెచ్చుట) అంకురార్పణ, వాస్తుపూజ, అగ్నిమధనం, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ ప్రధాన హోమములు నిర్వహించారు. రాత్రి 9:00 గంటలకు హారతి తీర్థప్రసాదాలు అందించారు. ఈ పూజ కార్యక్రమాలు దేవాలయ ఉపాధ్యక్షుడు, జూబ్లీహిల్స్ టర్బో మిషనరీ ఇంజినీరింగ్ ఎం డి తోటసుబ్బారాయుడు, బాల సురేష్బాబు, చందన ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

కొలువు దీరిన హనుమంతుడు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here