కొనసాగిన సైకిల్ ప్యాట్రోలింగ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా రాయదుర్గం ఎస్ హెచ్ఓ ఎం. మహేష్ ఆధ్వర్యంలో సైకిల్ ప్యాట్రోలింగ్ నిర్వహించారు. సైక్లిస్ట్ రవి బృందంతో కలిసి టెలికాం నగర్, గచ్చిబౌలి, ఖాజాగూడ, జైభేరి ఫైన్ వ్యాలీ, ప్రశాంతి హిల్స్, ల్యాంకో హిల్స్ రోడ్, మణికొండ, పంచవటి కాలనీ, హనుమాన్ నగర్, గంగోత్రి స్కూల్ లేన్, చిత్రపురి కొండలు, టింబర్ లేక్ కాలనీలలో ప్యాట్రోలింగ్ చేశారు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద సైక్లిస్ట్ రవి బృందంతో పోలీసులు

ప్యాపిలాన్ పరికరంతో అనుమానిత వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేశారు. సైక్లింగ్ బృందం జనార్దన్, ప్రతాప, చైతన్య, వంశీ, తేజేంద్ర, మంజునాథ్, మహేష్, సందీప్, శ్రీచరణ్, అనిమేష్, హసీబ్, రాజశేఖర్, విజయ్ కృష్ణ, విజయ్ ప్రసాద్, సంతాన సెల్వన్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

పంచవటి కాలనీ, సాయి లక్ష్మి కాలనీ వద్ద..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here