శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్యప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందడి కొనసాగతోంది. ఆయా రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హిందూపురం నుండి విచ్చేసిన ఎం డి విద్య ధరి బృందం కర్ణాటక గాత్రం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు.కర్ణాటక గాత్రం లో అన్నయ్య సంకీర్తనలు, పురందర దాసు కీర్తనలు, త్యాగరాయ కృతులను ఆలపించారు. కూచిపూడి నృత్య ప్రదర్శన లో భాగంగా బ్రహ్మాంజలి, జతిస్వరం, గణేష్ కౌతం, త్యాగరాయ కృతి, శివాష్టకం, ముద్దు గారెయ్ యశోద, చేరి యశోద కు శిశువు, దాండియా అంశాలను ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్నారు.

ఆకట్టుకున్న‌ కూచిపూడి నృత్యప్రదర్శన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here