పరీక్షల్లో ఫేలవుతాననే భయంతో.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. వివరాలు జ్ఞాన దీపికా కళాశాలలో కొండా దివ్య (17) ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతున్నది. మాదాపూర్ సాయి నగర్ లోని శ్రీ సాయి నిలయంలో ఉంటున్నారు. తన తండ్రి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే పరీక్షల్లో తప్పుతాననే ఆందోళనతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకున్నది. ఆమె తల్లి కవిత చూసి చుట్టుప్రక్కల వారి సహాయంతో కిందకు దింపి స్థానిక మెడికవర్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయిందనీ వైద్యులు తెలిపారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here