మద్యం మత్తులో దాడి.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నమస్తే శేరిలింగంపల్లి: మద్యం మత్తులో జరిగిన దాడిలో ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్‌ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. మనోజ్ యాదవ్ (33), అతని కజిన్ సోదరుడు రాంప్రవేష్ రాధేశ్యామ్ యాదవ్ (30) ఉపాధి కోసం యుపి రాష్ట్రం నుండి హైదరాబాద్ వచ్చి నల్లగండలోని అపర్ణ నిర్మాణ స్థలంలో ఉంటున్నారు. అయితే గత 15వ తేదీన అర్ద రాత్రి ఇద్దరూ మద్యం సేవించి ఒకరినొకరు గొడవ పడ్డారు. మనోజ్ యాదవ్ తన కజిన్ సోదరుడు రాంప్రవేష్‌పై డ్రిల్లింగ్ మిషన్‌తో దాడి చేసాడు. మద్యం మత్తులో ఇద్దరూ గదిలో పడుకున్నారు. అనంతరం ఉదయం రాంప్రవేష్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందానగర్‌ పోలీసులు హత్య కేసుగా నమోడు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here