పేదలు, రైతులు, కూలీలు, అసంఘటిత కార్మికులు ఎక్కడుంటే అక్కడే ఎర్రజెండా : శేరిలింగంపల్లి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ

నమస్తే శేరిలింగంపల్లి : పేదలు, రైతులు, కూలీలు, అసంఘటిత కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రజెండా ఉంటుందని శేరిలింగంపల్లి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శేరిలింగంపల్లి మండల నియోజకవర్గంలో వివిధ బస్తీలలో సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవాన్ని రంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన భారతదేశంలో 1925 డిసెంబర్ 26 న కాన్పూరులో పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం, భారతదేశ శాంతి కోసం అనేక పోరాటాలు చేసి ఎర్రజెండా కింద లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను పంచిందని పేర్కొన్నారు. దేశం కోసం బ్రిటిష్ వాళ్లని తరిమి కొట్టడం కోసం ప్రాణార్పణ చేసినటువంటి చరిత్ర ఎర్రజెండాదని చెప్పారు. ఎర్రజెండా అజేయం.. కమ్యూనిజం అజేయం.. సూర్యుడు ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ అజేయంగా జీవిస్తుందన్నారు. కార్యక్రమంలో కె. చందు యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కేక సింగ్, ఎం వెంకటేష్, ఎస్. బాలు, ఎస్. కొండల్, ఎస్. నరసమ్మ, ఎం. శ్రీను, కే శివ, జెట్టి శ్రీనివాస్, రవి పాల్గొన్నారు

సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవంలో శేరిలింగంపల్లి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here