జాగ్రత్తలతోనే కరోనా దూరం: కార్పొరేటర్ రాగం

సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్న రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి: సరైన జాగ్రత్తలు పాటించినపుడే కరోనా వ్యాధి సంక్రమించకుండా నిరోదించగలమని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని తారానగర్ లో గురువారం ఆయన పర్యటించారు. తారానగర్ లో కరోనా కేసులు రావడంతో చేసిన శానిటైజేషన్ వెహికిల్ ద్వారా సోడియం హైపో క్లోరైట్ ద్రావణం తో పిచికారీ చేశారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం తారానగర్ లో పలు చోట్ల నిర్మాణానికి నోచుకోని అంతర్గత రోడ్లను పరిశీలించారు. త్వరలోనే తారానగర్ లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సునిల్, టీఆర్ఎస్ డివిజన్ గౌరవాధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు జనార్థన్ గౌడ్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ తో పాటు నాయకులు గోవింద్ చారి, నట్ రాజ్, బసవరాజు, రవీందర్ తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here