అందరికీ అందుబాటులో ఉంటా.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని తెరాస నాయకులు , కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గడచిన రెండేండ్ల లో డివిజన్ అభివృద్ధికి విశేష కృషి చేశారని, మరింతగా అభివృద్ధి చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.

కార్పొరేటర్ గా రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ ను సన్నానిస్తున్న టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here