అభివృద్ధి పై ‘ఉప్పలపాటి’ సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ తెరాసా నాయకులు, కాలనీ వాసులు, అసో సియేషన్ సభ్యులతో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కాలనీలలో నెలకొన్న రోడ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. ముఖ్యంగా డ్రైనేజి, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో విడతలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ తెరాస నాయకులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here