అభివృద్ధిని చూసి ఓటేయండి: చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వం బిఆర్ఎస్ అని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలో సత్య ఎన్ క్లేవ్ కాలనీలో చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆరెకెపూడి గాంధీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బిఆర్ఏస్ పార్టీ నాయకులు ప్రసాద్, వెంకట్ రెడ్డి, రజినికాంత్, శ్రీకాంత్, రాజశేఖర్, భవాని చౌదరి, యశ్వంత్ అవినాష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here