ప్రతి కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి

  • ఎన్టీఆర్ నగర్ కాలనీ లో రూ. 1 కోటి 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు
  • పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో రూ. 1 కోటి 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కాలనీవాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన
మాట్లాడుతూ నాణ్యతా విషయంలో కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డులు పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వర్క్ ఇన్ స్పెక్టర్ విశ్వనాధ్ ఎన్టీఆర్ నగర్, కోశాధికారి వేణు గోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, రంగస్వామి ముదిరాజ్, ఎన్టీఆర్ నగర్ వాసులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు పర్యటిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here