యువతలో చైతన్యం రావాలి: బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ సురభి కాలనీ నుంచి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వెంకట్ భాను , సాయిరాంల మిత్ర బృందం, కాలనీ వాసులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమని, కేసిఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా .. మాయమాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారని, ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో మీకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు. సురభి కాలనీకి గతంలో తన తండ్రి భిక్షపతి యాదవ్ చేసిన అభివృద్ధి తప్ప ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు. మీకు ఎలాంటి ఇబ్బందులు, ఏ సమస్య వచ్చినా బిజెపి అండగా ఉంటుందని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఏల్లేష్ , సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ , ఆదిత్య పాల్గొన్నారు.

సురభి కాలనీ నుంచి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here