ప్రజాపాలనకు మెచ్చి కాంగ్రెస్ లోకి చేరికలు

  • సాదరంగా ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ ప్రజాపాలనకు మెచ్చి పలువురు నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బషీరుద్దీన్, మహమ్మద్ రషీద్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు నసిరుద్దీన్, మార్తాండ నగర్ యూత్ నాయకులు జలీల్ తదితరులు పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

జగదీశ్వర్ గౌడ్ తో పార్టీలో చేరిన కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు నసిరుద్దీన్, మార్తాండ నగర్ యూత్ నాయకులు జలీల్

ఈ కార్యక్రమంలో గౌసుద్దీన్, షేక్ ఇబ్రహీం, మహమ్మద్ ఫిరోజ్, చంద్ మియా పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here