కాంగ్రెసులో చేరికల జోరు

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ గెలుపునకు మద్దతుగా ఆ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా తాము కృషి చేస్తామంటూ పార్టీలో చేరుతున్నారు పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు.

పార్టీలో చేరిన సీనియర్ నాయకులకు కండువా కప్పి ఆహ్వానిస్తూ..

ఈ నేపథ్యంలో చందానగర్ డివిజన్‌ కేఎస్ ఆర్  కాలనీకి చెందిన సీనియర్ నాయకులు రవీంద్ర నాథ్, అరెకపూడి ప్రసాద్, కోటేశ్వర్ రావు, లింగరెడ్డి, రామ్ మోహన్ రావులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ  సందర్భంగా  ఆయన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జగదీశ్వర్ గౌడ్ మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here