రోడ్ వైండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని ఎంఐజి, రైల్ విహార్, తదితర కాలనీల ప్రజల సౌకర్యార్థం లింగంపల్లి రైల్వే స్టేషన్ రోడ్ వైడింగ్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. రోడ్ వైడింగ్ పనులలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, ఆంజనేయులు, సాయి పాల్గొన్నారు.

రోడ్ వైండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here