మియాపూర్ డివిజన్ అభివృద్దే లక్ష్యం : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

  • టీఎన్ నగర్ కాలనీలో కాలనీవాసులతో కలిసి పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని టీఎన్ నగర్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల పై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ టీఎన్ నగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకొని, కాలనీలో పాదయాత్ర చేపట్టామని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, మియాపూర్ డివిజన్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

టీఎన్ నగర్ కాలనీలో కాలనీవాసులతో కలిసి పాదయాత్ర చేస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని, రోడ్లు, డ్రైనేజి పనులు చేపడుతామని, అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ పరిధిలోనీ ప్రతి కాలనీలలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్ స్పెక్టర్ నవీన్, స్థానిక నాయకులు రమేష్, చంద్రకళ, నర్సింహులు, నందు, కాలనీ వాసులు, కృష్ణ, మల్లేష్, స్వాతి, శేఖర్, తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

టీఎన్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను కాలనీవాసులు అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here