మెరుగైన వసతుల కల్పనకు చర్యలు : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని కేఎంఆర్ ఎస్టేట్స్ లో సిసి రోడ్, ఎలక్ట్రికల్ పోల్స్, యూజిడి సమస్యలు పరిష్కరించాలని, పార్క్ పునరుద్దరణ చేపట్టాలని కేఎంఆర్ ఎస్టేట్స్ కాలనీ వాసులు ఆయనకు వినతి పత్రం అందజేశారు. దీనికి ఆయన స్పందించి కాలనీలోని సమస్యలు అడిగి తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

కేఎంఆర్ ఎస్టేట్స్ లో పాదయాత్ర చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

కార్యక్రమంలో వర్క్ ఇన్ స్పెక్టర్ మహేష్, వర్క్ ఇన్ స్పెక్టర్ జగన్ మోహన్, ప్రవీణ్, వీరబాబు, నిఖిల్, బాబి రెడ్డి, వెంకటేష్ రెడ్డి, సతీష్, ఉదయ్ భాను, రాజ్యలక్ష్మి, శ్రవణ్ కుమార్, అరవింద, గోపి నగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సందయనగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్ లింగయత్ జ్యోతిర్మయి, శ్యామంత్, సాయి కిరణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

స్థానికులు ఆయన దృష్టికి తెచ్చిన సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here