సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులతో కలిసి పర్యటించి, అక్కడ నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు రాక ఇబ్బంది పడుతున్నామని, స్థానికంగా ఉన్న మురుగు నీటి కాలువ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు.

గోపనపల్లి తండా లో కాలనీ వాసులతో కలిసి పర్యటిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి కావాల్సిన తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కాలనీ వాసులకు స్వచ్ఛమైన మంజీరా నీటిని అందించాలనే లక్ష్యంతో నూతనంగా పైపు లైనుల ఏర్పాటు చేయాలని హెచ్ఎండబ్ల్యుఎస్ డిజిఎం నారాయణను కోరారు. తదనంతరం గోపన్ పల్లి తండా లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను, కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ డిజిఎం నారాయణ,హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి, సీనియర్ నాయకులు శేఖర్, ప్రభాకర్, వేణు, నరసింహా,హెచ్ఎండబ్ల్యుఎ వర్క్ ఇన్ స్పెక్టర్ మోహన్ గోపనపల్లి తండా కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

గోపనపల్లి తండా లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here