మౌలిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: డివిజన్ లోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర నాయక్ తండా, సర్వే ఆఫ్ ఇండియా, దోబీ ఘాట్, బాలాజీ హిల్స్, వసంత్ సిటీ, సంకల్ప అపార్ట్ మెంట్ లలో కాలనీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.

కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

ఈ సంధర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు జిహెచ్ఎంసి ప్రారంభించిన “పబ్లిక్ కనెక్ట్” అనే కార్యక్రమం ద్వారా అన్ని విభాగాల అధికారులను ఒకే వేదికపై తెచ్చి సమస్యల పరిష్కారానికై కృషి చేయడం అభినందనీయమని అన్నారు. మాదాపూర్ డివిజన్ లో దాదాపు 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామని, మిగిలిన పనులు అతి త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ రెడ్డి, లాలూ నాయక్, హున్య నాయక్, గణపతి, రవి నాయక్, రందస్, ప్రసాద్, చారి, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ గుప్త, బాలరాజు గుప్త, శ్రీనివాస్ గుప్త, శ్రీధర్, రవి, జి.హెచ్.ఎం.సి డి.ఈ స్రవంతి, మాదాపూర్ ఏ.ఈ.ప్రశాంత్, పోలీస్ అధికారులు,హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి, ట్రాన్స్కో, శానిటేషన్, హెల్త్ డిపార్ట్ మెంట్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here