సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నివసిస్తున్న పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొగా.. సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి ద్వారా రూ. 4 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబందించిన సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి మంజూరి పత్రాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కి చెందిన ప్రియాంకకు రూ. 2 లక్షల 50 వేలు, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ కి చెందిన నర్సింహస్వామికి రూ. 1 లక్ష 50 వేలు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గండి తెలిపారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరరావు, దామోదర్ రెడ్డి, యాసీన్ పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు సీఎంఆర్ ఎఫ్ ఎల్ఓసి పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here