సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ ఎఫ్ నుంచి రూ. 3 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్ ఎల్ ఓసీ మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.

బాధిత కుటుంబాలకి సీఎం ఆర్ఎఫ్ ఎల్వోసీ పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ

కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కి చెందిన సయ్యద్ బాబు మియా కి రూ. 2 లక్షలు, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి కి చెందిన అరుణకి రూ. 1 లక్ష 50 వేలు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు అబీబ్ బాయ్, కోనేరు రాగప్రసాద్ , సైదేశ్వరరావు, కాశినాథ్ యాదవ్, తిరుపతి, రజినీకాంత్, అబ్దుల్ రహమాన్ , కుమార్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here