నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి వేముకుంటకి చెందిన బాధితులకు ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 4 లక్షల 50 వేలు మంజూరు అయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ అన్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంలా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం ఆదుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.