కామన్ ఎమనిటీస్ ను కబ్జానుండి కాపాడండి: కసిరెడ్డి భాస్కరరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన కామన్ ఎమనిటీస్ భూమిని, హుడా లేఅవుట్ లో ఉన్న విధంగా కబ్జాదారుల నుండి కాపాడాలని బిజెపి నేత, జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మియాపూర్ సిఐ తిరుపతిరావును కోరారు. మంగళవారం కాలనీ సభ్యులతో కలిసి దొంగ రిజిష్ట్రేషన్స్ చేసుకున్న కబ్జాదారులు భౌతిక దాడులకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని కోరారు. విషయం పూర్తిగా విన్న సిఐ తిరుపతిరావు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకుడు విజయకుమార్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, జయరాం రెడ్డి, విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

మియాపూర్ సిఐ తిరుపతిరావుతో జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here