చెత్తాచెదారాన్ని సత్వరమే తొలగించాలి

  • డిప్యూటీ కమిషనర్ ను కోరిన సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ ముదిరాజ్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సత్వరమే తొలగించేలా చర్యలు చేపట్టాలని శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ సర్కిల్ 22 డిప్యూటీ కమిషనర్ ను సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ ముదిరాజ్ కోరారు. చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో సుందెలుకలు, పందికొక్కులకు ఆవాసంగా తయారైందని తెలిపారు. చిన్నపిల్లలు అక్కడి పరిసరాల్లో ఆడుకుంటూ ఉంటారని, ఏ ప్రమాదం జరుగుతుందోనని నిత్యం వారి తల్లిదండ్రులు భయాందోళనలకు గురి అవుతున్నారని తెలిపారు. ఈ విషయమై పట్టణ ప్రగతిలో కోరితే తీసివేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఏ చర్య తీసుకోలేదని, ప్రజారోగ్య పరిరక్షణ కోసం సత్వరమే చెత్తను అక్కడి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా వేడుకున్నారు.

సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ ముదిరాజ్

శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో గుట్టలుగా పేరుకుపోయిన చెత్త
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here