చెరువుల అభివృద్ధి, సంరక్షణే ధ్యేయం : ప్రభుత్వ విప్ గాంధీ

  • రూ.2 కోట్ల 78 లక్షల అంచనా వ్యయంతో చెరువుల అభివృద్ధి
  • శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లోని కోమటి కుంట చెరువు, ప్రశాంతి హిల్స్ కాలనీ లోని కుమ్మరి కుంట చెరువు అభివృద్ధి లో భాగంగా రూ.2 కోట్ల 78 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న చెరువుల సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబ ఇరిగేషన్ అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ చెరువుల సుందరికరణలో భాగంగా చెరువు కట్టల పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం , పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ నగర్ లోని కోమటి కుంట చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు పర్యటిస్తున్న గాంధీ

నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. చెరువులను సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. కోమటి కుంట, మెడికుంట చెరువులను సుందరవనంగా, శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీ ఈ నళిని , ఏ ఈ నాగరాజు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మరబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు అన్వర్ షరీఫ్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, శ్రీను పటేల్, దారుగుపల్లి నరేష్, జంగయ్య యాదవ్, సురేందర్, రాజు ముదిరాజు, సురేష్ నాయక్, అశోక్, సల్లావుద్దీన్, అక్బర్, సురేష్ నాయక్, జగదీష్, గోవిందు, నర్సింహ రాజు, అనిల్ సింగ్, కాదర్ ఖాన్, నగేష్ , అంజమ్మ, బాల మణి, ఇందిరా, సుగుణ, మాధవి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, బిఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here