గుత్తేదారులు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేంకటాద్రి నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సిసిరోడ్డు పనులను చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ కాలని వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, గుత్తేదారులు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సుచించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిద్దాడనికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. చందానగర్ డివిజన్ లోని ప్రతి కాలనీని ఆదర్శవంతగా తీర్చిద్దాడనికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నరేందర్ భల్లా, రవిచంద్ర రెడ్డి కాలని వాసులు పాల్గొన్నారు.

 

రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here