ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో పయనించాలి

  • ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు.

ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మన నియోజకవర్గంలో మొదటి సారిగా గౌలి దొడ్డి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని, ఆయన చూపిన బాటలో పయనించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో విగ్రహ వ్యవస్థాపకులు తుకారం బాబు సెట్, సాయినాథ్, రాణప్ప, కరణ్, అర్జున్, రాము బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, బీఆర్ఎస్ నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, సురేందర్, నగేష్ పాల్గొన్నారు.

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ అనంతరం చిన్నారులతో ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here