భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదవాలి

  • 116 బాల విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సన్ షైన్ గ్లోబల్ స్కూల్ లో సరస్వతి దేవి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 116 బాల విద్యార్థులచే కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అక్షరాభ్యాసం చేయించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ బాల విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించడం చాలా సంతోషధాయకంగా ఉందని అన్నారు.

విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదవాలని, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని బాల విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఛైర్మెన్ పవన్, ప్రిన్సిపాల్ రాధిక, స్కూల్ మేనేజ్ మెంట్ & స్టాఫ్, జయంత్ కుమార్ సర్, వీరేశం గౌడ్, రాంచందర్, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, మహేష్ గౌడ్, గోపాల్ యాదవ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చిన్నారులకు పలకలు పంపిణీ చేస్తున్న నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here