సుస్థిర పాలన బీఆర్ఎస్ తోనే సాధ్యం : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికల ప్రచారంలో మహిళలు కాలని వాసులు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి  అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎన్ క్లేవ్ కాలనీలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఏస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాలతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి  ఓటు వేసి ఆశీర్వదిస్తే  ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని కాలనీవాసులకు వివరించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, బిఆర్ఏస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, యశ్వంత్, నరేందర్ బల్లా, రాహుల్, సికిందర్, అవినాష్ రెడ్డి, వెంకటేశ్ ఎర్వ, దీక్షిత్, మల్లారెడ్డి, పి బి కె చౌదరి, గోపాల్ రావు, వీరేశం, నరేందర్ రెడ్డి, శ్రీశైలం, రంగస్వామి రెడ్డి, ప్రభుకుమార్, నిఖిల్, హుస్సేన్  పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here