ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్ననటువంటి సిసి రోడ్ల పనులను స్థానికులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులను పరిశీలించామని, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టేలా అధికారులు దగ్గరుంచి పనులు చేయించాలని అన్నారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కాలనీలో నెలకొన్న రోడ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని, ముఖ్యంగా డ్రైనేజి, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో విడతలవారీగా పరిష్కరిస్తామని, డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్ స్పెక్టర్ నవీన్, గోపాల్ రెడ్డి, ప్రన్స్సిస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మయూరి నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను స్థానికులతో కలసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here