నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట, గౌతమి నగర్ లో రూ. 1 కోటి అంచనావ్యయంతో చేపడుతున్న యూజీడీ నిర్మాణ పనులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. యూజీడీ అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు తెరాస నాయకులు అక్బర్ ఖాన్, సందీప్ , యూసఫ్, కాలనీ వాసులు ఖదీర్, సత్యనారాయణ, ప్రేమ్ చంద్, సుధాకర్, శరీఫుద్దీన్, నారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలోని యూజీడీ నిర్మాణ పనులను కార్పొరేటర్లతో కలిసి పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here