సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నానక్ రాంగూడలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కాలనీవాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయంలో సీసీ రోడ్డులు పనులను పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. అనంతరం నానక్ రాంగూడ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, దేవేందర్ రెడ్డి, ప్రకాష్ సింగ్, దేవరకొండ గోపాల్, మాధవ రెడ్డి, జితేందర్ సింగ్, అరవింద్ సింగ్, అరుణ్ గౌడ్, నర్సింగ్ నాయక్, వరలక్ష్మి, కవిత భాయి, జితేందర్ రెడ్డి, బాబులుసింగ్ , శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాధవ రెడ్డి, ఉమేశ్వర్ గౌడ్, నానక్ రామ్ గూడా కాలనీ వాసులు, వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.

నానక్ రాం గూడలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలంచేందుకు పర్యటిస్తున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here