సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ కాలనీ, రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ, తారా నగర్ కాలనీలలో జరుగుతున్న సీసీ డ్డు పనులను కాలనీవాసులు, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనుల గురించి తెలుసుకుంటున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా కాంట్రాక్టర్లు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా సిసిరోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం చేస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు, Ghmc అధికారులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here