ఆశా వర్కర్ల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి

నమస్తే శేరిలింగంపల్లి: స్కూటమి డబ్బాలను ఆశ వర్కర్లతో మోయించే విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా నిర్వహిస్తున్న సర్వేలు ఇతరత్రా కార్యక్రమాలకు పారితోషికాలు చెల్లించాలని కోరుతూ..శేరిలింగంపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ శైలజ కు తెలంగాణ ఆశావర్కర్ల యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. పనులు చేసిన తర్వాత బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అధికారులను అడిగితే ఏం సమాధానం చెప్పడం లేదని, తక్షణమే పెండింగ్ బిల్లులను చెల్లించాలని, 10 వేల ఫిక్స్ డ్ వేతనం చెల్లించాలన్నారు.

శేరిలింగంపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ శైలజకు వినతి పత్రం అందజేస్తున్న తెలంగాణ ఆశావర్కర్ల యూనియన్ ప్రతినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here